Thursday, 14 May 2015

ఆరోగ్యం

శ్లో" అగస్త్యం కుంభకర్ణంచ శ మంచ బడబానలమ్"
     ఆహారపరిణామార్దం స్మరామిచ వృకోదరమ్"

ఈ శ్లోకమును బోజనము చేయగానే ధ్యానించిన వారికి ఆహారపదార్దములు చక్కగా జీర్ణమై 
శరీరారోగ్యమై కలిగించును.    

కార్య జయం

శ్లో" యశ్శివొ నామరూపాభ్యాం యాదేవిసర్వమంగాలా 
     తయోస్సంస్మరణాత్పుoసాం సర్వాత జయమంగళం 
     లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాంపరాభవ
     యేషామిందీవరశ్యామోహృదయస్తోజనార్దన:

ఈ శ్లోకమును ఇంటినుండి కార్యార్దముగా వెళ్ళునప్పుడు ధ్యానించిన యెడల 
ఆ కార్యము నిర్విగ్నముగా నెరవేరుటయే  గాక ధనలాభము కలిగించును. 

ఐస్వర్యప్రప్తికి

మూలమంత్రం;-  "ఓం హౌం నమశ్శివాయ" 

భార్య భర్తల మధ్య విరోధము తొలగిపోవుటకు

మూలమంత్రము:-" ఓం నమో మహాయక్షిణ్యె మమ పతిం (ఆముకం ) మే వశ్యం కురు కురు స్వాహా "

భార్య భర్తల మధ్య విరోధము వచ్చి భార్య పుటింటికి వెళ్లి వుండిపోయిన రోజులలో రాత్రిపూట ఆవు నేతితో దీపం
వెలిగించి ఆ దీపం వద్ద స్త్రీ కుర్చుని పైన వ్రాసిన మంత్రమును 108 సార్లు చొప్పున 11 రాత్రులు జపం చేస్తే ఆమె భర్త
తనంత తానుగా వచ్చి తన భార్యను ప్రేమగా తీసుకువేల్లిపోవును. సుకంగా కలతలు లేకుండా కాపురము చేయుదురు. ఈ రహస్యం భర్తకు తెలియనియకూడదు.   

వివాహం కొరకు

దుర్గ దేవి ఆలయమందు కానీ దేవత పటము నందు కానీ కుర్చుని ఆ దేవతను పూజించి ప్రతి రోజు పాత్రకలమందు
నాకు వివాహం కావాలి అని తలుచుకొని రోజు 11 సార్లు చొప్పున తులసి కవచమును 40 రోజులు పారాయణం చేయటం వలన ఏకారణం చేత వివాహం కాకపోయినను ఆ కారణం తొలగిపోయి వివాహం నిశ్చయముగా అగును. 

దరిద్రం పోవటానికి

తులసి చెట్టు వద్ద గని సూర్యోదయము కాలమందు సుర్యునుకి ఎదురుగా కుర్చుని తులసి చెట్టుని పూజించి 
నమస్కరించి ఈ తులసి కవచమును ప్రతి రోజు విడవకుండా జపించు వారాలకు దరిద్రం నశించి, దైవభక్తి వృద్ది 
చెంది ఐశ్వర్యవంతులై  సుఖించెదరు. సర్వప్రదములు తొలగిపోవును. అంత్యమందు విష్ణు సాన్నిధ్యము లభించును. 

తులసి కవచం





   ఈ కవచమును ప్రతినిత్యము పాత్ర:కాలమందు పారాయణము చేయువరాలకు ఆరోగ్యము, ఆయుర్దాయము,
   అభివృద్ది చెందును. అకాల మరణములు దరిచేరవు. సంతానవృద్ది,పశువృద్ది, ధనవృద్ది, సర్వజన వస్యము
   లభించును. నిరుద్యోగులకు ఉద్యోగము, ఉద్యోగులకు ఉద్యోగ అభివృద్ది కలుగును. స్త్రిలకు ఈ కవచం పారాయణం
   చేయటం వలన సౌభాగ్యం వృద్ది చెందును.